సూర్యాపేట : సూర్యాపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి వలసలు పెరుగుతున్నాయి. వారం రోజులుగా వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా సూర్యాపేట పట్టణం 28వ వార్డు కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో వంద మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు.
సీఎం కేసీఆర్ సహకారంతో సూర్యాపేట ను జిల్లాగా ఏర్పాటు చేయడంతోపాటు అన్నివిధాలుగా అభివృద్ధి చేశారన్నారు. పదేండ్ల కిందట సూర్యాపేటకు ఇప్పటి పరిస్థితులను ప్రజలు బేరీజు వేసుకోవాలని కోరారు. పట్టణాన్ని, గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేశామన్నారు. చేసిన అభివృద్ధిని చూసి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కు ప్రజలు అండగా నిలవాలని కోరారు.
పార్టీలో చేరిన వారిలో చిన్న అంజద్ ,సాజిద్, వాజిద్, నజీర్, ఆరీఫ్, పాషా, ట్రిల్లు ప్రభాకర్, శ్రీమాన్, చిన్న, నవీన్, రమేష్, తప్పెట్ల నగేష్, ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు మొయినుద్దీన్ ,ఇండ్ల సురేష్ , రాపర్తి పెద్ద శీను, రాపర్తి సైదులు, కెక్కిరేణి ఆనంద్, దేవశెట్టి శ్రీను, మీసాల మొయినుద్దీన్, రాపర్తి లక్ష్మయ్య పాల్గొన్నారు.