చేర్యాల: పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫుల్ జోష్లో టూర్ చేస్తున్నారు. బిజీ బిజీగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రచార వేళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి .. జనగామ నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చేర్యాల మండలం చిట్యాలలో ఇవాళ స్థానిక మహిళలతో కలిసి ఆయన బతుకమ్మ ఆడారు. మహిళలతో కలిసి ఆయన కాసేపు స్టెప్పులేశారు. బతుకమ్మ ఆడిన ఆయన ప్రజల్లో జోష్ నింపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయన ప్రజలకు తెలియజేశారు. గ్రామంలోని ప్రజల్ని కలిసిన ఆయన అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బతుకమ్మ ఆడిన ఆయన మహిళల్లో ఉత్సాహాన్ని నింపారు.
చేర్యాలలో ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి.. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. పార్టీ కార్యకర్తల్లో ఆయన ఫుల్ జోష్ నింపారు. ప్రజల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. pic.twitter.com/oAx4PdxP6F
— Namasthe Telangana (@ntdailyonline) October 26, 2023
జనగామ నియోజకవర్గ ప్రజలు ఆనందంతో, ఉత్సాహాంగా తనకు హారతులు ఇస్తున్నారని పల్లా పేర్కొన్నారు. మూడవసారి కూడా తెలంగాణ సీఎం కేసీఆరే కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని ఆయన వెల్లడించారు. తనను కూడా దీవించాలని ప్రజల్ని కోరుకున్నాని, దానికి వారి స్పందన అద్వితీయంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. తమ సర్కార్ పింఛన్లను పెంచిందని, సౌభాగ్య లక్ష్మీ కింద మహిళలకు మూడు వేలు ఇవ్వనున్నట్లు చెప్పారు. గ్యాస్ ధరను 400కు చేస్తున్నామని, రేషన్ కార్డు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తామన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి మళ్లీ కేసీఆర్ సర్కార్ను తీసుకురావాలని ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రజల్ని కోరారు.
చేర్యాలలో ప్రచారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి.. స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. పార్టీ కార్యకర్తల్లో ఆయన ఫుల్ జోష్ నింపారు. ప్రజల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల్లో చైతన్యం నింపుతున్నారు. pic.twitter.com/1M8c7sanXF
— Namasthe Telangana (@ntdailyonline) October 26, 2023