జయశంకర్ భూపాలపల్లి : చేసిన పనిని సగర్వంగా చెప్పుకుందాం..బీఆర్ఎస్ను గెలిపిద్దామని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి(Gandra Jyothi) అన్నారు. శుక్రవారం టేకుమట్ల మండలంలోని ఆశిరెడ్డిపల్లి పంగిడిపల్లి, పెద్దంపల్లి, వెలిశాల గ్రామాల్లో భూపాలపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిని గెలిపించాలని కోరుతూ.. ఎన్నికల ప్రచారలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..త్వరలో జరుగబోయే ఎన్నికలు అభివృద్ధికి, దొంగ మాటలకు జరిగే యుద్ధం అన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో పల్లెల రూపురేఖలు మారాయని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో లేని ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. రమణారెడ్డి గెలుపు పేద ప్రజల అభివృద్ధికి మలుపు అని చెప్పారు. రమణారెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.