సంగారెడ్డి, అక్టోబర్ 17 : తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రంలో జరగడంలేదని, అభివృద్ధ్ది, సంక్షేమంలో దేశానికి రాష్ట్రం ఆదర్శమని, మూడోసారి జరుగనున్న శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టే గెలిచేదని బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జులు రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ భైపాల్రెడ్డి, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్లతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సారి ఎన్నికల్లో ఆలోచించి ప్రజలకు అందుబాటులో ఉండే తనను గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చారని, ప్రజలు ఆశీర్వాదించాలన్నారు.
నియోజకవర్గ ప్రజల కోసం నిరంతరం శ్రమించే నాయకుడు చింతాప్రభాకరని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావులకు ప్రత్యేక ధన్యవాదాలని టీఎస్ఎంఐడీసీ చైర్మన్ శ్రీనివాస్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ భూపాల్రెడ్డి పేర్కొన్నారు. సంగారెడ్డి నియోజకవర్గాన్ని గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్కు కానుకగా ఇస్తామని, ప్రజల నాయకుడు చింతా ప్రభాకర్ను గెలిపించే బాధ్యత ప్రజలపై ఉందన్నారు. తెలంగాణ ద్రోహుల అడ్రస్ గల్లంతు చేయాలని, అభివృద్ధ్ది, సంక్షేమంలో దేశానికే ఆదర్శమని గుర్తుచేశారు. జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాలతో సహా అనేక పనులు అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కిందన్నారు. పదవి లేకపోయిన ప్రజల సమస్యలు పరిష్కరించి నిత్యం ప్రజల మధ్యలో ఉండే నాయకులు చింతా ప్రభాకర్ అని అందుకే ప్రభాకర్ను గెలిపించాని కోరారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, నాయకులు జైపాల్రెడ్డి, లియాకత్ అలీ తదితరులు పాల్గొన్నారు.
– టీఎస్ఎంఐడీసీ చైర్మన్ శ్రీనివాస్, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ భూపాల్రెడ్డి