నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో నూతనంగా ఏర్పాటైన ఫార్మసీ కళాశాలలో పార్ట్టైం అధ్యాపకుల నియామకానికి రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు.
సిలబస్ లేకుండా పరీక్షలను నిర్వహించారు. సబ్జెక్టులవారీగా నిర్వహించిన పరీక్షల్లో అభ్యర్థికి వచ్చిన మార్కుల ఆధారంగా కాకుండా, హాజరైన ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూకు పిలిచారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవో 21 రద్దు చేయాలని వరుసగా మూడవరోజు పార్ట్ టైం అధ్యాపకులు కేయు పరిపాలనా భవనం ముందు తమ అత్యున్నత విద్యార్హత డాక్టరేట్ని ప్రదర్శిస్తూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు.