హెచ్పీఆర్సీ ఇంటర్నేషనల్ ఎరీనా పోలో చాంపియన్షిప్లో భారత్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 12-3 తేడాతో జర్మనీపై అద్భుత విజయం సాధించింది.
అంతర్జాతీయ పోలో పోటీలకు హైదరాబాద్ మరోసారి వేదికైంది. ఆరు జట్ల సమాహారంతో హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్(హెచ్పీఆర్సీ)లో టోర్నీ సోమవారం అట్టహాసంగా మొదలైంది.