హైదరాబాద్ ఆట ప్రతినిధి: హెచ్పీఆర్సీ ఈక్వెస్ట్రియన్ చాలెంజ్ టోర్నమెంట్లోయువ రైడర్లు సత్తా చాటారు. గండిపేటలోని హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్లో శనివారం జరిగిన హ్యాక్స్ కేటగిరీ అండర్ 12 విభాగంలో హెచ్పీఆర్సీ క్లబ్ రైడర్ అనన్యా గుప్తా 54 స్కోరుతో విజేతగా నిలిచింది.
హ్యాక్స్ అండర్-10 విభాగంలో జోహా ఫయాజ్ , దియా పాండే (హెచ్పీఆర్సీ) చెరో 40 స్కోరుతో సంయుక్తంగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అండర్ 13-16 విభాగంలో ఫ్లై సీ స్టేషన్ క్లబ్ రైడర్ చెరువు ధన్వి 31 స్కోరుతో స్వర్ణం గెలుచుకుంది. డ్రెస్సేజ్ జూనియర్స్ విభాగంలో గౌతమ్ సంజయ్ (హెచ్పీఆర్సీ) 52.8 శాతం స్కోరుతో విజేతగా నిలిచాడు.