Polo | హైదరాబాద్, ఆట ప్రతినిధి: అంతర్జాతీయ పోలో పోటీలకు హైదరాబాద్ మరోసారి వేదికైంది. ఆరు జట్ల సమాహారంతో హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్(హెచ్పీఆర్సీ)లో టోర్నీ సోమవారం అట్టహాసంగా మొదలైంది. అజీజ్నగర్(మొయినాబాద్) వేదికగా ఈ నెల 10వ తేదీ వరకు జరుగనున్న టోర్నీలో ఆతిథ్య భారత్తో పాటు అమెరికా తరఫున రెండేసి జట్లు బరిలోకి దిగుతుండగా, స్పెయిన్, లక్సెంబర్గ్ ఒక్కో టీమ్ను పోటీకి దింపుతున్నాయి.
పోటీలకు తొలి రోజైన సోమవారం భారత్, అమెరికా జట్లు పోటీపడ్డాయి. నాలుగు జట్లు బరిలోకి దిగడం హెచ్పీఆర్సీ చరిత్రలో ఇది తొలిసారి అని నిర్వాహకులు పేర్కొన్నారు. హెచ్పీఆర్సీలో పోలో ప్రపంచకప్ నిర్వహించడం తన లక్ష్యమని అధ్యక్షుడు చైతన్యకుమార్ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.