Vetlapalem Explosion | కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు లో గురువారం మరొకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 28కి చేరుకుంది.
ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలోని వేట్లపాలెం పరిధిలోని బాణాసంచా కేంద్రంలో శనివారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 21 మంది అక్కడికక్కడే మృత్యువాతపడగా, 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి.