కాకినాడ : కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం ( Vetlapalem ) లో బాణసంచా ( fireworks ) తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ( Explosion ) లో మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. పంట పొలాల మధ్య నెలకొల్పి తయారీ కేంద్రంలో ఫిబ్రవరి 28న ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 23 మంది సజీవ దహనమం కాగా మరో 15 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల పాలయ్యారు.
ఈ ఘటనలో బుధవారం కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ వీర శ్రీను (39) అనే వ్యక్తి మృతి చెందారు. దీంతో ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 25కు చేరింది. మంగళవారం ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లోవరాజు మరణించిన విషయం విదితమే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మిగిలిన ఐదుగురు క్షతగాత్రులకు వైద్య సేవలు కొనసాగుతున్నాయి. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.