దేశీయ విమానప్రయాణికులు భారీగా పెరుగుతున్నారు. జనవరి నెలలో 1.524 కోట్ల మంది ప్రయాణించారని పౌర విమానయాన నియంత్రణ మండలి డీజీసీఏ తన నివేదికలో వెల్లడించింది.
గత నెలలో దేశీయంగా 1.43 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. క్రితం ఏడాది ఇదే నెలలో ప్రయాణించిన వారితో పోలిస్తే 8.45 శాతం చొప్పున పెరిగారని డీజీసీఏ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.