రూ. 7కోట్ల 20లక్షలతో సమీకృత వెజ్, నాజ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన రూ. 2కోట్లతో వైకుంఠధామాల నిర్మాణాలు
కోదాడ: కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నానని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని తమ్మర, బాలాజీనగర్లలో రూ.2 కోట్లతో వైకుంఠ ధామాల నిర్మాణాలకు శంకుస్థాప నతో పాటు, రూ.7కోట్ల 20 లక్షలతో సంతలో సమీకృత వెజ్-నాన్వెజ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శరవేగంగా అబివృద్ధి చెందుతున్న కోదాడ పట్టణంలో భవిష్యత్ను దృష్టిలో పెట్టు కుని సమీకృత వెజ్-నాన్వెజ్ మార్కెట్ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు, రైతులకు ఎంత గానో ఉపయోగపడు తుందని, అన్ని ఒకే చోట దొరికే విధంగా 108 సముదాయాలతో మార్కెట్ను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
కోట్లాది రూపాయలతో కోదాడ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ప్రతి నెలా మున్సి పాలిటీల అబివృద్ధి కోసం కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని అన్నారు. రాష్ట్రంలో పట్టణాలు అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నట్లు తెలిపారు. కోదాడను పూర్తి స్థాయిలో అభివృద్ది చేసే భాధ్యత తనదేనన్నారు.
అదే విధంగా మున్సిపాలటిలో విలీనమైన గ్రామాలలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని తెలి పారు. అంతిమ సంస్కారాల కోసం ప్రభుత్వం వైకుంఠధామాలను నిర్మిస్తున్నదని తెలిపారు. అధికారులు ప్రజల పట్ల నిర్లక్ష్యం చేయకుండా ప్రజాప్రతినిధులు తమ వార్డుల అబివృద్ధి కొరకు అడిన పనులను వెంటనే చేయాలని సూచించారు.
కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బుర్రా సుధారాణి , మున్సిపల్ చైర్పర్సన్ వనపర్తి శిరీష, మున్సిపల్ కమిష నర్ నాగేంద్రబాబు, వైస్ చైర్పర్సన్ వెంపటి పద్మ, సంపెట ఉపేందర్, వార్డు కౌన్సిలర్ కట్టెబోయిన జ్యోతి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వరావు, గ్రంధాలయ చైర్మన్ రహీం, అనంత సైదయ్య, పెండెం వెంకటేశ్వర్లు, తిపిరిశెట్టి సుశీల, కైలా స్వామినాయక్, సామినేని నరేశ్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.