సూర్యాపేట : ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. తిరుమలగిరి మండలం సాలెగూడెంకి చెందిన చెందిన బానోతు భోజ్య, నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన కరింగుల ఉమ, మద్దిరాల మండలం మావిళ్లమడవ గ్రామానికి చెందిన నాగవేల్లి వెంకటమ్మ గత కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించారు.
వారికి టీఆర్ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉండటంతో పార్టీ తరఫున మంజూరైన ఇన్సూరెన్స్ చెక్కులను తిరుమలగిరిలోని ఎమ్మెల్యే నివాసంలో బాధిత కుటుంబ సభ్యులకు ఒక్కొరికి రెండు లక్షల రూపాయలచెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రమాదంలో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకునేందుకు బీమా సౌకర్యం కల్పించారన్నారు. పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీ కంటికి రెప్పలా కాపాడుకుంటుందన్నారు.