చివ్వెంల: హరితహారంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రహదారుల వెంట నాటిన ప్రతి మొక్కను బ్రతికించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని అక్కలదేవి గూడెం వద్ద సూర్యాపేట-ఖమ్మం రహదారిపై నాటిన మొక్కలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద శాతం మొక్కలు బ్రతికి ఉండేలా చూడాలని, చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను రీ ప్లేస్ చేయాలని అధి కారులను ఆదేశించారు.
ఆయన వెంట అటవీశాఖ జిల్లా అధికారి ముకుందరెడ్డి, ఏంపీడీవో జమలా రెడ్డి, ఏంపీవో గోపి, ఫారెస్ట్ బీట్ అధికారి ప్రశాంతి, టీఏలు రమాదేవి, విజయ్ కుమార్, పంచాతీ కార్యదర్శులు అంజయ్య, స్వప్న తదితరులు ఉన్నారు.