బొడ్రాయిబజార్: మేదరులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా శనివారం కుడకుడ రోడ్లో ఏర్పాటు చేసిన వెదురు వస్తువుల ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల్లో వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు.
జిల్లా కేంద్రంలో మేదర సంఘం భవన నిర్మాణానికి స్థలం కేటాయించే విషయాన్ని మంత్రి జగదీశ్రెడ్డి దృష్టికి తీసుకెళు తానన్నారు. మేదరులను అన్ని విధాల ఆదుకునేందుకు తన శాయ శక్తులా కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మేదర సంఘం జిల్లా అధ్యక్షుడు నోముల మల్లేశం, గౌరవాధ్యక్షుడు సులువ యాదగిరి, ప్రధాన కార్యదర్వి కోన మల్లయ్య, కోశాధికారి పిల్లి యాదయ్య, శేర్ల వెంకన్న, నోముల నిరంజన్, పిట్టల ఉపేందర్, మహిళా నాయకులు పాల్గొన్నారు.