సూర్యాపేట రూరల్: కార్తీక మాసం సందర్భంగా చారిత్రక పిల్లలమర్రి శివాలయాల్లో జరిగే ఉత్సవాలను విజయవంతం చేయాలని శివాలయ కమిటీ చైర్మన్ వల్లాల సైదులుయాదవ్ అన్నారు. సోమవారం పట్టణ పరిధిలోని పిల్లలమర్రి గ్రామం లో మహదేవనామేశ్వర స్వామి ఆలయంలో కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. నవంబర్ 5 నుంచి తెల్లవారు జామున అభిషేకం సాయంత్రం ఆకాశ దీప పూజలతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు.
8న నాగుల చవితి, 12న గోమాతకు విశేష పూజ, 14న కుంకుమార్చన, 15న పండ్లతో అలంకరణ, 18న కార్తీక పౌర్ణమి సందర్భంగా అభిషేకాలు, దీపాలంకరణ, 22న అర్ధనారీశ్వర అలంకరణ, 23న అన్నాభిషేకం, 29 బస్మాభిషేకం, 30న రుధ్రాభిషేకం, డిసెంబర్ 4న రుద్రహోమం, 5న పోలీస్వర్గం కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయన్నారు.
డిసెంబర్ 2న మాస శివరాత్రి సందర్భంగా మహాదేవనామేశ్వర స్వామి కల్యాణమహోత్సవం అనంతరం అన్నదానం నిర్వ హిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ దేవాలయ కమిటీ చైర్మన్ రాపర్తి సైదులుగౌడ్, మాజీ సర్పంచ్ సోమగాని లింగస్వామిగౌడ్, టీఆర్ఎస్ నాయకులు బంగారి శ్రీనివాస్, రాపర్తి మహేశ్, శంకర్, నాగరాజు, అర్చకులు సంతోష్శర్మ తదితరులు పాల్గొన్నారు.