మోతె, నవంబర్ 26 : పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరం లాంటిదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి వారికి అండగా ఉంటున్నదన్నారు. మండలవ్యాప్తంగా 102మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.1,02,16,932 విలువైన చెక్కులు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో తాసీల్దార్ పి.యాదగిరి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శీలం సైదులు, జిల్లా నాయకులు ఏలూరి వెంకటేశ్వర్రావు, సిరికొండ పీఏసీఎస్ చైర్మన్ కొండపల్లి వెంకట్రెడ్డి, ఎంపీటీసీ ఫోరం మండలాధ్యక్షుడు కంపాటి వెంకన్న, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పొనుగోటి నర్సింహారావు, మండల యూత్ అధ్యక్షుడు జానిపాష, పలువురు నాయకులు పాల్గొన్నారు.
దైవ చింతనతో మానసిక ప్రశాంతత
మోతె : దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మండలంలోని రాంపుతరం తండా గ్రామంలో ముత్యాలమ్మ ఆలయంలో శనివారం నిర్వహించిన బొడ్రాయి శాంతి హోమ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు శీలం సైదులు, ఏలూరి వెంకటేశ్వర్రావు, సిరికొండ పీఏసీఎస్ చైర్మన్ కొండపల్లి వెంకట్రెడ్డి, ఎంపీటీసీ కవితామహేందర్, సర్పంచులు వాసంశెట్టి రమేశ్, కోటేశ్, నర్సింహారావు, శ్రీనివాస్రెడ్డి, వెంకన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.
కోదాడ లీగ్ క్రికెట్ జెర్సీ ఆవిష్కరణ
కోదాడ రూరల్ : పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో కోదాడ క్రికెట్ లీగ్ జెర్సీని ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ చింతా కవితారెడ్డి, టీడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు అంజన్గౌడ్, బెజవాడ శ్రవణ్, అనంతుల ఆంజనేయులు, కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి నర్సింహారావు, ఉపేందర్, వంశీ, క్రీడాకారులు పాల్గొన్నారు.