తిరుమలగిరి, ఏప్రిల్ 10 : మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ పోతరాజు రజినీరాజశేఖర్ అన్నారు. శనివారం 13వ వార్డులో ఆమె పర్యటించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ప్రజలు వారి సమస్యలను తన దృష్టికి తీసుకు రావాలని కోరారు. ఆమె వెంట కౌన్సిలర్ సరిత, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.