సూర్యాపేట రూరల్: హరితహారంలో నాటిన మొక్కలు సంరక్షించాలని, మొక్కలు లేని స్థానంలో వెంటనే మొక్కలను నాటాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని సూర్యాపేట – జనగాం రహదారికి ఇరువైపులా హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించి మాట్లాడారు.
హరితహారంలో నాటిన ప్రతి మొక్కను కాపాడాలని, ప్రతి మొక్కకు రక్షణగా ట్రీగార్డులను ఏర్పాటు చేయాలని అధికారుల కు సూచించారు. రాజా నాయక్తండా వద్ద ఉన్న మొక్కలను చూసి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం మొక్క ల సంరక్షణకు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అడిషనల్ పీడీ సురేశ్, ఎపీడీ రాజు, ఎంపీడీవో శ్రీనివాస్రావు, పంచాయితీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.