వేములపల్లి, జూన్ 27 : మండలంలోని మొల్కపట్నం ఐసొలేషన్ కేం ద్రంలో ఉన్న కరోనా పేషెంట్లకు గ్రామానికి చెందిన ఎల్లబోయిన పోలెరాజ్, రవి ఆదివారం రూ.10 వేల ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ నామిరెడ్డి కరుణాకర్రెడ్డి, సైదులు, సత్యం, హరీశ్, శివలింగం, నాగరాజు పాల్గొన్నారు.
పండ్లు పంపిణీ
నందికొండ : కమలా నెహ్రూ ఏరియా దవాఖానలో ఆదివారం టీఆర్ఎస్ నాయకుడు మోహన్నాయక్ కరోనా రోగులకు పండ్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ క్రిశాంక్ జన్మదినం సందర్భంగా పండ్లు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ రమేశ్జీ, నాయకులు ఆదాసు విక్రమ్, బాలు, చంద్రమౌలి, దేవునాయక్ పాల్గొన్నారు.
హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో
నేరెడుగొమ్ము(చందంపేట) : మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన భూషరాజు పద్మయ్య ఇటీవల కరోనాతో మృతి చెందగా ఆదివారం అతడి కుటుంబానికి హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.10 వేలు అందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు అన్వేశ్రెడ్డి, నరేశ్, హన్మంతు, సాయి, ఆంజనేయులు, వెంకట్రామ్రెడ్డి, అమర్ పాల్గొన్నారు.