ఆత్మకూర్(ఎస్), జూన్ 24 : హరితహారం 7వ విడుత లక్ష్యాన్ని అధిగమించి మండలాన్ని హరిత వనంగా మార్చాలని జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి అన్నారు. మండలంలోని ఏపూరు గ్రామంలో హరితహారం, వైకుంఠధామం, డంపింగ్ యార్డులను గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. దాచారం నుంచి ఏపూరు గ్రామం వరకు రోడ్డు వెంట రెండు వరుసల్లో మొక్కలు నాటేందుకు మండల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సానబోయిన రజిత, ఎంపీడీఓ మల్సూర్నాయక్, ఎంపీఓ సంజీవ, ఏపీఓ ఈశ్వర్, గ్రామస్తులు
వైకుంఠధామాలను పూర్తి చేయాలి
చివ్వెంల : పెండింగ్లో ఉన్న వైకుంఠధామాల పనులను వెంటనే పూర్తి చేయాలని జడ్పీ సీఈఓ ప్రేమ్కరణ్రెడ్డి పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశానికి ఆయన ఆకస్మికంగా హాజరై మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు శ్రమించి ప్రగతి లక్ష్యాలను నెరవేర్చాలన్నారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు కంపచెట్లు తొలగించాలని సూచించారు. మండలంలోని అన్ని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ కె.జమలారెడ్డి, ఎంపీఓ గోపి, ఏపీఓ నాగయ్య, ఈసీ జ్యోతి, కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.