సూర్యాపేట టౌన్, జూన్ 21 : యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధ్దిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో కొంత సమయాన్ని యోగాకు కేటాయించాలని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచర్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి జగదీశ్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. యోగాతో ఒత్తిడిని జయించవచ్చన్నారు. అనంతరం యోగా గురువులను సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితాఆనంద్, రాచర్ల ఫౌండేషన్ చైర్మన్ రాచర్ల కమలాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముప్పారపు నాగేశ్వర్రావు, వాసవీభవన్ అధ్యక్షుడు తోట శ్యాంప్రసాద్, వాసవీక్లబ్ అధ్యక్షుడు కలకోట లక్ష్మయ్య, దారం శ్రీనివాస్, కరుణాకర్రెడ్డి, యోగా గురువులు చాడ పాపిరెడ్డి, వెంకట్రెడ్డి, స్వరూప, ఉమ, ఉప్పల శ్రీదేవి, నాగేశ్వర్రావు, సుధీర్ పాల్గొన్నారు.
మానసిక ప్రశాంతత : జడ్పీటీసీ
మఠంపల్లి : యోగాతో మానసిక ప్రశాంతత సిద్ధిస్తుందని జడ్పీటీసీ బానోతు జగన్నాయక్ అన్నారు. మండలంలోని బాడవతండా గ్రామ పంచాయతీలో యోగా శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. సర్పంచ్ ధరావత్ గోవింద్నాయక్, గ్రామ కార్యదర్శి హరికిరణ్, వార్డు సభ్యులు మాన్యానాయక్, నవీన్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కోదాడ : యోగాతో శారీరక, మానసిక వికాసం కలుగుతుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఓర్సు వెలంగిరాజు అన్నారు. పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో పట్టణాధ్యక్షుడు నకిరేకంటి జగన్మోహన్రావు ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాభ్యాసంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిరాజు వెంకట్రావు, ఉపాధ్యక్షుడు పోల సురేశ్, యువమోర్చా పట్టణాధ్యక్షుడు నరేశ్, చందూలాల్, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
కోదాడ టౌన్ : పట్టణంలోని కట్టకమ్మగూడెం బైపాస్ వద్ద గల మైదానంలో యోగాసనాల ప్రదర్శన నిర్వహించారు. యోగా గురువు శివరాంప్రసాద్, మేకల రాజారావు, కోట నర్సింహారావు, ఇస్మాయిల్, తిపిరిశెట్టి శ్రీనివాస్రావు, లోకేశ్, వీరారెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు.
నేరేడుచర్ల : స్థానిక సరస్వతీ శిశుమందిర్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో యోగా శిక్షకుడు మెట్టు వేణుగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో యోగా శిక్షణ నిర్వహించారు. బట్టు మధు, కందిబండ శ్రీనివాస్రావు, సత్యనారాయణరెడ్డి, క్రాంతికుమార్, కొణతం వెంకట్రెడ్డి, మోహన్, నోముల మల్లేశం, క్రాంతి, రవికుమార్, సాయి పాల్గొన్నారు.
చివ్వెంల : మండల కేంద్రం, బండమీది చందుపట్లలో పీఏసీఎస్ చైర్మన్ మారినేని సుధీర్రావు అధికారులతో కలిసి యోగాసనాలు వేయించారు. ఎంపీడీఓ జమలారెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు సుధాకర్రెడ్డి, సర్పంచ్ బోయిళ్ల కృష్ణ, ఎంపీఓ గోపి, ఉపసర్పంచ్ కృష్ణ పాల్గొన్నారు.
ఆత్మకూర్.ఎస్ : నెమ్మికల్ జడ్పీ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి అధికారులు యోగాసనాలు వేశారు. ఎంపీడీఓ మల్సూర్నాయక్, సర్పంచ్ దావీద్, ఎంపీటీసీ ము త్తయ్య, ఎంపీఓ సంజీవ, ఏపీఓ ఈశ్వర్ పాల్గొన్నారు.
మద్దిరాల : మండలంలోని గోరెంట్ల గ్రామంలో అంగన్వాడీ టీచర్లు మం జుల, అరుణ అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలతో యోగాసనాలు వేయించారు.
అర్వపల్లి : మండలంలోని తిమ్మాపురం సూర్యనారాయణ స్వామి ఆలయం, పర్సాయపల్లి గ్రామాల్లో యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.