ప్రయాణికులకు నీడ కరువు
నాగారం, ఏప్రిల్7 : మండలంలోని నాగారం బంగ్లా ఎక్స్ రోడ్డు వద్ద సూర్యాపేట-జనగాం జాతీయ రహదారిపై ఉన్న బస్టాప్ బైకుల స్టాండ్గా మారింది. మండలంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు నిత్యం మండల కేంద్రానికి వచ్చి వెళ్తుంటారు. బస్సుల కోసం వేచి ఉండేందుకు వీలుగా నిర్మించిన బస్టాప్ బైక్ పార్కింగ్ ప్రాంతంగా మార్చడంతో ప్రయాణికులకు నిలువ నీడ లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్న తరుణంలో కనీసం కూర్చునే వీలులేక రోడ్డుపైనే నిలబడాల్సి వస్తున్నదని స్థానికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు బస్టాప్ను ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ కూడా చదవండీ…
ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి