హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ)/శంషాబాద్: సినీఫక్కీలో బంగారాన్ని విమానం వాష్రూంలో దాచి తరలించిన వ్యక్తిని కస్టమ్స్ అధికారులు బుధవారం అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి కొచ్చిన్ మీదుగా హైదరాబాద్కు వస్తున్న ఓ ప్రయాణికుడు బంగారం తరలిస్తున్నట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్టులో మాటువేశారు. విమానం హైదరాబాద్ చేరుకోగానే తనిఖీలు చేపట్టగా విమానం వాష్రూంలో 1.2 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్లో రూ. 60 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.