నేరేడుచర్ల: పాఠశాలకు వచ్చే విద్యార్ధులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి అన్నారు. పాఠశాలలను పునః ప్రారంభించిన నేపథ్యంలో మండలంలోని వైకుంఠాపురం గ్రామంలోని ప్రాథ మిక పాఠశాలను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరగతి గదులను, వంట గదులను పూర్తి స్థాయిలో శానిటైజ్ చేసి ఆరోగ్య కరమైన వాతావరణం కల్పించాలన్నారు.
దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్ధుకుంటుందన్నారు. మధ్యాహ్న భోజనానికి వినియోగించే వంట సామగ్రిని వేడీ నీటితో శుభ్రం చేయాలని, పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి, జడ్పీటీసీ నర్సయ్య, వైస్ ఎంపీపీ లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమిరెడ్డి, గ్రామ సర్పంచ్ అమృతారెడ్డి, ఎంపీటీసీ రాజేశ్, అరిబండి సురేశ్ పాల్గొన్నారు.