మేళ్లచెర్వు: స్థానిక స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామి వారికి మహన్యాస పూర్వక రుద్రా భిషేకం, అమ్మవారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన పూజలను అర్చకులు శివ విష్ణువర్దన్ శర్మ, ధనుంజయ శర్మ శాస్ర్తోక్తంగా జరిపించారు.
అనంతరం స్వామివారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించి మహానివేదన, మంగళ నీరాజనం మంత్ర పుష్ప పూజలను వేదమంత్రాలతో జరిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.