పెన్పహాడ్: ప్రభుత్వ అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే గుత్తేదారులను గానీ సంబంధిత అధికారులను గానీ సహించే ప్రసక్తి లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి హెచ్చరించారు. గురువారం మండల పరిధిలోని దూపాడ్ వద్ద దురాజ్పల్లి-గడ్డిపల్లి ప్రధాన రహాదారి పనులను ఆయన అకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు.
దూపాడ్ వద్ద వేసిన రహదారి మాసం రోజుల్లోనే శిధిలావస్థకు చేరడంతో గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు కలసి పనుల్లో నాణ్యత లేదని.. ఇష్టారాజ్యం గా సీసీ, బీటీ రోడ్డు పనులు జరుగుతున్నాయని.. ఆర్ అండ్ బీ అధికారులతో పేర్కోన్నా పట్టించుకోవడం లేదని మంత్రికి ఇటీవల విన్నవించారు.
ఈ మేరకు గురువారం మంత్రి అకస్మిక తనిఖీ చేసి రహదారి దుస్థితిపై అధికారులపై గరం గరమయ్యారు. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే రహాదారి వేసిన వెంటనే గుంతలు ఏలా పడతాయని..కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా పనులు చేస్తుంటే అధికారులు ఉండి దేనికి అని ప్రశ్నించారు.
దీంతో నీళ్లు నమిలిన అధికారు లు పొరపాటున ఒప్పుకొని మళ్లీ తప్పిదాలు జరుగకుండా పర్యవేక్షణ చేపడుతామని తెలపడంతో మంత్రి శాంతించారు. పక్షం రోజుల్లో అంబేద్కర్ విగ్రహం నుంచి మిషన్ భగీరథ ట్యాంకు వరకు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సీసీ రహదారిని నిర్మించాలని మంత్రి ఆదేశించారు.
రహాదారిని ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై వెంటనే స్పందించి నేరుగా ప్రదేశాన్ని పరిశీలించి అధికారుల తో మాట్లాడి సమస్యను శాశ్వతంగా పరిస్క రించడపై మంత్రి జగదీశ్రెడ్డికి గ్రామస్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వారి వెంట నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, సర్పంచ్ బిట్టు నాగేశ్వర్రావు, వైస్ ఎంపీపీ గార్లపాటి సింగారెడ్డి, గుట్ట డైరక్టర్ ఆవుల అంజయ్యయాదవ్, గార్లపాటి స్వర్ణ, బిట్టు వెంకన్న, సరోజన సైదయ్య, కొప్పోలు రంగమ్మ ఉన్నారు.