అర్వపల్లి, తుంగతుర్తి, మద్దిరాల: హరితహారంలో నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా సంరక్షించాలని జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం అర్వపల్లి, తుంగతుర్తి, మద్దిరాల మండలాల పరిధిలోని సూర్యాపేట-జనగాం రహాదారి వెంబడి హరితహారంలో నాటిన మొక్కలను ఆయన పరిశీ లించిన అనంతరం అధికారులకు పలు సూచ నలు చేశారు. రహాదారుల వెంబడి నాటిన మొక్కలను నిరంతరం పర్యవేక్షిస్తూ కాపాడాలని సూచించారు. గ్రామ పంచా యతీల ఆధ్వర్యంలో రక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు.
హరితహారంలో నాటిన మొక్కలు ఎండిపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సూర్యాపేట-జనగాం జాతీయ రహాదారి వెంబడి నాటిన మొక్కలు ఏపుగా పెరిగే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. నాటిన మొక్కలన్నీ పెరిగి పెద్దవైతే రహాదారంతా పచ్చదనం నిండిపోయి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుందన్నారు.
మొక్కల పెరుగుదల వల్ల వాహానాల ద్వారా ఏర్పడే వాయు కాలుష్యాన్ని నియంత్రించవచ్చన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు నాటిన ప్రతి మొక్కను కాపాడేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ కిరణ్ కుమార్, ఏపీడీ సురేశ్, ఏపీవో శైలజ, సుధీర్, రాజు, ఎంపీడీవో, సర్పంచ్లు పంచా యతీ కార్యదర్శి నాగరాజు, ఉపాధిహామీ సిబ్బంది దీపిక, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.