నాగారం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ పథకాలు, వాటి ఫలాలను చూసిన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. దీంతో టీఆర్ఎస్లో భారీగా చేరికలు జరుగుతున్నాయని తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్ పట్టణంలోని ఉప్పల్లో ఎమ్మెల్యే నివాసంలో నాగారం మండలం పస్తాల గ్రామానికి చెందిన సుమారు 50 కుటుంబాలు, ఆదర్శ్ యూత్ క్లబ్ సభ్యులు, నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వీరంతా.. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగింది అని అన్నారు. నూతనంగా టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన వారిని కిశోర్ కుమార్.. గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని గొప్ప పథకాలను తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్, దళిత బంధు వంటి బృహత్తరమైన పథకాలను కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తుచేశారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్కు చెందిన మేడే శ్రీకాంత్, కట్ట సాగర్, మేడే అనిల్, భూషణం శేఖర్, అశోక్, ఆదర్శ్ యూత్ సభ్యులు గాజుల కిషోర్తో పాటు పలువురు నాయకులు టీఆర్ఎస్లో చేరారు. ఈ కార్యక్రమంలో నాగారం టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండగాని అంబయ్య గౌడ్, టీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్బాబు, చిల్లర చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి కేశాగాని అంజయ్య ఉప సర్పంచ్ చిత్తలుారి రమేష్ గౌడ్ తదితర నాయకులు ఉన్నారు