పెన్పహాడ్: ప్రతి ఒక్కరూ తాము నమ్ముకున్న మతాన్ని ప్రేమిస్తూ భక్తిబావం పెంపొందించుకోవాలని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కోరారు. బుధ వారం మండల పరిధిలోని గాజులమల్కాపురంలో ప్రభుత్వం (సీజీఎఫ్) నిధులు రూ.40లక్షలు, అలాగే దాతల సహాకారంతో సేకరించిన రూ.10లక్షల నిధులతో నూతనంగా నిర్మించ తలపెట్టిన సీతారామాంజనేయ స్వామి దేవాలయ నిర్మాణ పనులకు మంత్రి పూజలు నిర్వహించి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ప్రతి మానవాళి ఆధ్యాత్మికతను అలవరుచుకున్నప్పుడే మానసిక ప్రశాతంత పొందవచ్చన్నారు. ఆధ్మాత్మిక చింతనను దైనందిక జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వం లో సర్వ మతాల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పించినట్లు ఆయన తెలిపారు. అందులో భాగంగానే పేద మహిళలకు బతుకమ్మ చీరెలు, ముస్లీం, క్రైస్తవుల పండుగలకు దుస్తుల తోఫా కిట్ అందించి ఆదుకుంటున్నట్లు తెలిపారు.
కార్యక్రమములో ఎంపీపీ నెమ్మాది భిక్షం, సర్పంచ్ బండి ధనమ్మ, ఎంపీటీసీ జ్యోతి, పీఏసీఎస్ చైర్మన్ వెన్న సీతారాంరెడ్డి, వైస్ చైర్మన్ వావిళ్ళ రమేశ్, బండి రామ కృష్ణారెడ్డి, మండాది నగేశ్, మామిడి అంజయ్య, బెల్లంకొండ ఢాంగే, దాతలు ఉప్పల రాంరెడ్డి, బండి మధుసూదన్రెడ్డి, బండి ఇంద్రసేనారెడ్డి, బండి రామకృస్ణారెడ్డి, మోత్కూరి శ్రీనివాస్చారి, బండి గిరిదర్రెడ్డి, బండి సుధాకర్రెడ్డి, రణబోతు వెంకటరెడ్డి, దేవాలయ కమిటి అద్యక్షుడు బండి శ్రీనివాస్రెడ్డి, ఆవుల అంజయ్య, సము ద్రాల రాంబాబు, బిట్టు నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.