సూర్యాపేట : హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్డు విస్తరణలో ఇండ్లు కోల్పోయిన వారికే ముందుగా ఇండ్లు ఇస్తామని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు కోల్పోయిన వారికి ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఒక్కొక్క నియోజకవర్గంలో 3000 ఇండ్లు ఇచ్చారన్నారు.
త్వరలోనే బాధితులకు ఇండ్లు నిర్మిస్తామన్నారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామన్నారు. హుజురాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.