గరిడేపల్లి: ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని కీతవారిగూడెం గ్రామానికి చెందిన బోనకుర్తి శ్రీజ అనారోగ్యానికి గురికావడంతో ఆమె చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.2 లక్షల చెక్కును శుక్రవారం ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పెండెం సుజాత శ్రీనివాస్ గౌడ్, వైస్ ఎంపీపీ గుత్తికొండ ప్రమీల వెంకటరమణారెడ్డి, కీతవారిగూడెం సర్పంచ్ కీత జ్యోతి రామారావు తదితరులు పాల్గొన్నారు.