సూర్యాపేట టౌన్, జూలై 6 : ఓ వైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే.. మరోవైపు సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసి వివక్షను జయించిన యోధుడు బాబూ జగ్జీవన్రామ్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొనియాడారు. జగ్జీవన్రామ్ వర్ధంతి సందర్భంగా బుధవారం సూర్యాపేట కొత్త బస్టాండ్ సమీపంలోని ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పాలనా దక్షత, ప్రజల పట్ల ఎనలేని ప్రేమ, నిస్వార్థ సేవ, అసమాన ప్రతిభతో తిరుగులేని నాయకుడిగా బాబూ జగ్జీవన్రామ్ దేశంలో ప్రత్యేకంగా నిలిచారన్నారు. అవమానాలు, ఆటంకాలు ఎదురైనా కుల రహిత సమాజం కోసం, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడ్డారని గుర్తుచేశారు. అటువంటి ఎందరో మహనీయుల కలలు నేడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాకారమవుతున్నాయని పేర్కొన్నారు. జగ్జీవన్ రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని యువత నవ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసి వివక్షను జయించిన యోధుడు బాబూ జగ్జీవన్ రామ్ అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొనియాడారు. బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, భారత ఉప ప్రధానిగా ఆయన ప్రజలకు ఎన్నో సేవలందించారన్నారు. జగ్జీవన్ రామ్ జీవిత కాలంలో ఎన్నో అవమానాలు, ఆటంకాలు ఎదుర్కొని సమాజాన్ని ప్రభావితం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
సామాజిక సంస్కరణోద్యమాల్లో జగ్జీవన్ రామ్ విశిష్టమైన స్థానాన్ని పదిల పరుచుకున్నారన్నారు. సామాజిక సమానత్వానికి అలుపెరుగని పోరాటం చేసి.. కుల రహిత సమాజం కోసం జీవితాంతం పోరాడాడన్నారు. అలాంటి ఎందరో మహనీయుల కలలు ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సాకారమవుతున్నాయన్నారు. బాబూ జగ్జీవన్ రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని నవ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, జడ్పీటీసీ జీడి భిక్షం, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఉప్పల లలితాఆనంద్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, నాయకులు గుడిపూడి వెంకటే శ్వరరావు, ఊట్కూరి సైదులు, చింతలపాటి చిన్న శ్రీరాములు, ఉప్పల ఆనంద్, బత్తుల ప్రసాద్, తల్లమళ్ల హసేన్, చిట్టిపాక రాములు పాల్గొన్నారు.