ఆత్మకూరు(ఎం), జూన్ 29 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉత్తమ విద్యనందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి బుధవారం అన్ని అంశాలపై అవగాహన కల్పించేందుకు బోధన కార్యక్రమాన్ని చేపట్టామని జిల్లా కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. బుధవారం మండలంలోని మొరిపిరాల ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో 65 మంది విద్యార్థులు చదువుతుండగా 20 మంది వివిధ తరగతులకు చెందిన విద్యార్థులతో పాఠ్యపుస్తకాలను చదించారు. విద్యార్థులు తెలుగుతో పాటు ఇంగ్లిష్లో చదవడంతో పాటు కలెక్టర్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పడంతో సంతృప్తి వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం మొరిపిరాల కొత్త చెరువు కట్టను పరిశీలించారు. కట్టకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. ఆమె వెంట జిల్లా అదనపు కలెక్టర్ దీపక్తివారీ, సెక్టోరియల్ అధికారి అండాలు, ఏఎండీ శ్రీనివాస్, మండల ప్రత్యేకాధిరి రాజారాం, ఎంపీపీ తండా మంగమ్మాశ్రీశైలంగౌడ్, నీటి పారుదల శాఖ డీఈ సునీల్ప్రసాద్, తాసీల్దార్ జయమ్మ, సర్పంచ్ సామ తిరుమల్రెడ్డి, ఎంఈఓ లక్ష్మీనారాయణ, ప్రధానోపాధ్యాయుడు యాస పద్మారెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు.