సూర్యాపేట : హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేవారు.
అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి ఒక నీతి, ఒక జాతి లేని వ్యక్తి అని తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో నీ పాత్ర ఎక్కడ. ఒక రోజు ఒక పార్టీ మరో రోజు మరో పార్టీ ఇంతకి రేవంత్ రెడ్డి నువ్వు ఏ పార్టీలో తెలవక కాంగ్రెస్ పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారని విమర్శించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎప్పుడైనా నీ బొమ్మ పెట్టుకున్నారా.. ఒక నాయకుడు ఉన్నారా అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి చావు నోట్లో తల పెట్టి రాష్ట్రాన్ని ప్రకటించిన కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయటం రేవంత్ రెడ్డి సిగ్గుమాలిన పని కి నిదర్శనం అన్నారు.
రేవంత్ రెడ్డి ఓ దొంగ. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన నోట్ల దొంగ. ఇక పై సీఎం కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే రేవంత్ రెడ్డి ఏ నియోజకవర్గంలో నువ్వు తిరగ లేవని హెచ్చరించారు.విమర్శలు చేసి దిగజారుడు చర్యలకు దిగితే ఇకపై తాము కూడా అలాగే జవాబు ఇస్తామని అన్నారు.