సూర్యాపేట : బీఆర్ఎస్ ప్రభుత్వం, సూర్యాపేటలో జరిగిన అభివృద్ధిపై ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టాలని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్రెడ్డి (Minister Jagdish Reddy) యువకులకు పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన యువ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు యువకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ (BRS) లో చేరారు. పట్టణాన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు శాయశక్తులా కృషి చేస్తానని వెల్లడించారు. శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని పేర్కొన్నారు.‘ యువతకు ఉద్యోగాలు సృష్టించాలనేదే తన ముందున్న లక్ష్యం. రెండు ట్యాంక్ బండ్లు ఉన్న ఏకైక పట్టణం రాష్ట్రంలో సూర్యాపేట. నెక్లెస్ రోడ్డును తలపించేలా మూడవ టాంక్ బండ్ నల్లచెరువును మారుస్తా ’నని హామీ ఇచ్చారు.
కారు గుర్తుకే ఓటువేసి బీఆర్ఎస్ గెలిపించుకుందాం. భవిష్యత్తును నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సాయికుమార్, కాసం మని, అజయ్, వసంత్ ఆధ్వర్యంలో యువ సమ్మేళనం జరిగింది. రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్, గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మారుపెద్ది శ్రీనివాస్ గౌడ్, డాక్టర్ రామ్మూర్తి యాదవ్, బత్తుల జానీ తదితరులు పాల్గొన్నారు.