సూర్యాపేట : జిల్లాలోని పెన్ పహాడ్ మండలం అనంతారం క్రాస్ రోడ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి గురువారం ప్రారంభించారు. అలాగే వైనతేయ రెస్టారెంట్, వైనతేయ బ్రిక్స్, వైనతేయ ఇంజినీరింగ్ వర్క్స్, వైనతేయ స్టీల్, సిమెంట్ షాప్ లను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్, ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ మామిడి అనిత, సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు యుగేందర్, తదితరులు పాల్గొన్నారు.