మేళ్లచెర్వు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల తెచ్చిన 4 కోడుల కార్మిక చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు ప్రభుత్వాన్ని కోరారు. సిమెంటు పరిశ్రమల ప్రాంతంలో కార్మికుల స్థితిగతులపై అధ్యయన యాత్రలో భాగంగా ఆదివారం మండలంలోని రామాపురం ప్రియా సిమెంట్స్ కార్మికులతో ఆయన మాట్లాడారు.
కేంద్ర తెచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో ఈ నెల 30 వరకు జరిగే పాదయాత్రను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కిష్టపట్టె ఏరియా సిమెంటు క్లస్టర్ కమిటీ ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి , జిల్లా ఉపాధ్యక్షుడు సోమపంగు రాధాకృష్ణ, వట్టెపు సైదులు, తీగల శ్రీను, అజార్ తదితరులు పాల్గొన్నారు.