మఠంపల్లి: కృష్ణా నది తీరాన వేంచేసియున్న మండలంలోని లక్ష్మీనరసింహ స్వామి వారికి దేవాలయ అర్చకులచే నిత్య కల్యాణం శాస్ర్తోక్తంగా శనివారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకం,
పట్టు వస్ర్తాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కల్యాణతంతు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త చెన్నూరి మట్టపల్లిరావు, ఈవో సిరికొండ నవీన్, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.