మఠంపల్లి: త్వరలో మఠంపల్లి మండల కేంద్రానికి ఐటీ శాఖ మంత్రి, పార్టీ అధ్యక్షుడు కేటీఆర్ రానున్నట్లు ఎమ్మెల్యే శానం పూడి సైదిరెడ్డి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నిర్మాణ పనులను, రైతు వేదికను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ రైతువేదికను ప్రారంభించి నియోజకవర్గ పార్టీ కార్య కర్తలకు సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సమావేశ సభ కోసం స్థలాన్ని పరిశీలించారు.
కార్యక్రమంలో జిల్లా రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు, సర్పంచ్ మన్నెం శ్రీనివాస్రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రధా న కార్యదర్శి ఇరుగు పిచ్చయ్య, అశోక్, ఉపాధ్యక్షుడు కొండేటి సుధాకర్రెడ్డి, ఉపసర్పంచ్ జాలకిరణ్, మజీద్ కమిటీ అధ్యక్షుడు పఠాన్ హఫీజ్ఖాన్, మాజీ ఎంపీపీ కొండానాయక్, గ్రంథాలయం చైర్మన్ బద్రంరాజు రామారావు, వల్లపుదాసు బాలకృష్ణ, వల్లపుదాసు సురేశ్, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.