దమ్ముంటే ఆరోపణలు నిరూపించాలి
ల్యాండ్ మైనింగ్ మాపియాకు తెరలేపింది నీవే కదా…..
హౌసింగ్ కుంభకోణంపై అసెంబ్లీలో చర్చ జరిగిన చరిత్ర నీది
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహలను ధ్వంసం చేసింది ఎవరు
ఆరోపణలు నిరూపించిన తర్వాతే కోదాడలో అడుగు పెట్టాలి
కోదాడ: సొంత గడ్డపై మమకారంతో 16 సంవత్సరాల క్రితం నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయా ల్లోకి వచ్చాను.. ప్రజల కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటూ కుటుంబ సభ్యుడిలా మెలి గిన నన్ను ఎమ్మెల్యేగా గెలిపిం చారు.. ప్రజలు నన్ను ఆశీర్వదించారు.. ఎటువంటి మచ్చలేని తనపై ఆసత్య ఆరోపణలు చేసిన ఉత్తమ్కుమార్ రెడ్డి దమ్ముంటే నిరూపించాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో మండి పడ్డారు.
శుక్రవారం కోదాడ టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమని తాను ఎక్కడికైనా వస్తానని ఉత్తమ్కు సవాల్ విసిరారు. కోదాడ, హు జూర్నగర్ నియోజక వర్గాలలో ల్యాండ్ మైనింగ్ మాఫియాకు తెరలేపింది మీరు కాదా అని ఎద్దేవా చేశారు. చివరకు క్లబ్ ద్వారా మూడు ము క్కల ఆట ఆడించిన ఘనత కూడా ఉత్తమ్దేనన్నారు. ఆయన హయంలోనే వైన్ షాపుల సిండికేట్లు ఏర్పాడ్డాయని, ఇప్పుడు కూడా కుడి, ఎడమ ఆయన అనుచరులే అందులో భాగస్వాములన్నారు.
అధికారులను, పోలీసులను అర్థరాత్రి దాటిందంటే చాలు పరుష పదజాలంతో దూషించిన నీకు వారిపై ఎంత ప్రేమ ఉందో ఇట్టే తెలుస్తుందన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. మాజీ ముఖ్య మంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహలను ధ్వంసం చేసింది ఎవరూ.. విజయమ్మ పర్యటనను అడ్డుకున్నదెవరనేది అందరికీ తెలిసిందేనన్నారు.
తనపై వచ్చిన ఆరోపణలు నిరూపించిన తర్వాతే కోదాడలో అడుగు పెట్టాలని హెచ్చరించారు. కమీషన్లకు కకుర్తిపడి ఆచరణకు సాధ్యంకాని మాధవరం రిజర్వాయర్ను కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఇరవై ఒక్క గ్రామాలకు మంచి నీరు అందించాల్సిన ఈ ప్రాజెక్ట్ నుంచి ఒక చుక్క నీరు కూడా అందడం లేదు. దీంతో పాటు సింగారం ప్రాజెక్ట్ కూడా అదే పరిస్థితి ఈ రెండు ఉదాహరణలే నీ అవినీతికి నిదర్శమన్నారు.
సాగర్ ఆధునీకరణ పనులను ఆంధ్ర కాంట్రాక్టర్లకు అప్పగించి కోట్ల కమిషన్ దండుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నిం చారు. నియోజకవర్గంలో పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందేలా చర్యలు తీసుకుంటు న్నామని…..తనపై వచ్చిన ఆరోపణలు నిరూపించాలి లేనట్లయితే బేషరతుగా క్షమాపణ చెప్పాలని హెచ్చరించారు.
సోలార్ ప్రాజెక్ట్లు, దుబాయ్లో పరిశ్రమలు, మేళ్లచెర్వులో మండలంలో బినామీల పేరుతో వందల ఎక రాలు నీకు ఎక్కడి నుండి వచ్చాయో అందరికి తెలుసునని అదంతా అవినీతి సోమ్ముతోనేనని….ఉనికి కోసమే ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నారని..ఆ పార్టీ కార్యకర్తలపై ఆత్మీయత లేదని కరోణ కష్ట కాలంలోనూ చనిపోయిన కార్యకర్తల కుటుం బాలను పరామర్శించడానికి సమయం లేని ఈయన ఆత్మీయసమ్మేళనం ఏర్పాటు చేయడం పట్ల ఆ పార్టీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు.
ఈ సమావేశంలో ఎంపీపీ చింతా కవితారెడ్డి, రైతు బంధుసమితి అధ్యక్షుడు సుంకర అజయ్కుమార్, పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వరావు, మండల పార్టీ అధ్యక్షుడు కాసాని వెంకటేశ్వర్లు, బుర్రా పుల్లారెడ్డి, కట్టెబోయి న శ్రీనివాస్ యాదవ్, పయిడిమర్రి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు.