చిలుకూరు: గర్భిణులు ప్రతిరోజూ పౌష్టికాహారం తీసుకోవాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. గురువారం చిలుకూరు మండల కేంద్రంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ్ మాసం సందర్భంగా మండల స్థాయిలో నిర్వహించిన పోషణ్ అభయాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గర్బిణులను, బాలింతలను, చిన్నారులను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.
అంగన్వాడీ కేంద్రాలను సమర్ధవంతంగా నడపాలని, చిన్నారులు ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో మండల వ్యాప్తంగా గర్భిణులకు సీమంతాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలుత పోషణ్ మాసం సందర్బంగా కేక్ కట్ చేశారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాల్స్ను ఆయన పరి శీలించారు.ఈ సందర్బంగా చేసిన చిన్నారులు నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. పోషణ్ మాసం సందర్బంగా అంగ న్వాడీ టీచర్లు ఏర్పాటు చేసిన సింబల్ పలువురిని ఆకట్టుకుంది.
కార్యక్రమంలో జిల్లా వయోవృద్ధుల శిశు సంక్షేమ అధికారిణి జ్యోతి పద్మ, సీడీపీవో విజయలక్ష్మి, పోషణ్ అభయాన్ జిల్లా కోఆర్డినేటర్ సంపత్, ఎంపీపీ బండ్ల ప్రశాంతి, జడ్పీటీసీ బొలిశెట్టి శిరీష, జిల్లా కోఆప్షన్ సభ్యులు జానిమియా, డీసీసీబీ డైరె క్టర్ కొండా సైదయ్య, సర్పంచ్ కొడారు బాబు, ఎంపీటీ సీ బెల్లంకొండ రమణ, మాజీ జడ్పీటీసీ భట్టు శివాజీనాయక్, సూప ర్వైజర్లు సూర్యకళ, రమణ, అంగన్వాడీ టీచర్లు విలాసకవి నిర్మల, సిరికొండ కవిత, జయలక్ష్మి పాల్గొన్నారు.