చింతలపాలెం: టీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు పార్టీలోకి చేరుతున్నట్లు హుజూ ర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండల పరిధిలోని రేబల్లె గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బుధవారం హుజూర్నగర్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీలో కొత్త, పాత అనే తారతమ్యాలు లేకుండా అంతా పార్టీ అభివృద్ధికి కృషి చేయా లన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరికి అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి, మోహన్రెడ్డి, నరసింహారెడ్డి, సతీశ్రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, సైదులు, నాగరాజు, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.