హుజూర్నగర్ టౌన్: దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్వాడీ టీచర్లకు, ఇతర వర్కర్లకు గౌరవప్రదమైన వేతనం ఇస్తూ వారికి భరోసా కల్పించింది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.బుధవారం పట్టణంలో ని సాయిబాబా కల్యాణమండపంలో నిర్వహించిన పోషణ్అభియాన్ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు.
గర్భిణులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు పౌషకాహారం అందిస్తూ, అంగన్వాడీ టీచర్ తీసుకుంటున్న శ్రద్ధ కన్న తల్లిని తలపింస్తుందన్నారు. గత ప్రభుత్వాలు ఇచ్చిన వేతనాలు కనీస అవసరాలు కూడా తీర్చలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వీరి కష్టాన్ని గుర్తించి వేతనాలు పెంచారన్నారు.
కార్యక్రమంలో సంక్షేమశాఖ అధికారి జ్యోతి పద్మ, సీడీపీవో విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, జడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, కౌన్సిలర్ నాగేశ్వరావు, అమర్నాథ్రెడ్డి, హరిబాబు, రామకృష్ణ, సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.