కోదాడ : సీఎం సహయనిధి పథకం నిరుపేదలకు వరంలాంటిదని టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు చందు నాగేశ్వరావు అన్నారు. మంగళవారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో 6 మంది లబ్దిదారులకు రూ. 4.20 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్ చేయూతనిస్తున్నారని కొనియాడారు. ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు ఈ పథకం వరం లాంటిదని అన్నారు.
అభివృద్ది, సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ప్రభుత్వ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు గుండెల సూర్యనారాయణ, పెండెం వెంకటేశ్వర్లు, కట్టెబొయిన శ్రీనివాస్ యాదవ్, వంటిపులి శ్రీను, సాధిక్, గంధం పాండు, వంశీ తదితరులు పాల్గొన్నారు.