నందికొండ, జనవరి 1 : మద్యం మత్తులో ఇరువర్గాల మధ్య ఘర్షణతో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన నందికొండలో శనివారం రాత్రి జరిగింది. ఎస్ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం..శ్రీకాంత్ తన పుట్టిన రోజును పురస్కరించుకొని స్నేహితులు రసూల్, వినహర్, సంతోష్, చారికి హిల్కాలనీలోని ప్రాజెక్ట్ హౌస్లో పార్టీ ఏర్పాటు చేశాడు. రాత్రి మూడు గంటల సమయంలో రసూల్ సోదరుడు మిరావలి బైక్లో పెట్రోల్ అయిపోగా రసూల్కు ఫోన్ చేయడంతో బయటకు వెళ్లిపోయాడు. ఇదే సమయంలో ప్రాజెక్ట్ హౌస్లో పార్టీ చేసుకుంటున్న వారి వద్దకు విష్ణు, రాజా, రాహుల్ అఖిల్, నాగార్జున అనే స్నేహితులు వచ్చారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ గొడవలో శ్రీకాంత్ను బీర్ బాటిల్తో గొంతు వద్ద గాయపరిచారు. ఈ విషయం రసూల్కు చెప్పగా, తన సోదరుడు మిరావలితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే గొడవ జరుగుతుండడంతో వివాదాన్ని ఆపేందుకు ప్రయత్నించిన మిరావలిని విచక్షణా రహితంగా బీర్ బాటిల్తో గాయపరిచారు. ఏదో గొడవ జరుగుతుందని రోడ్డుపై అటువైపు వెళ్తున్న కార్తీక్ గొడవ దగ్గరకి వెళ్లగా అతన్ని కూడా గాయపరిచారు. ఘటనలో శ్రీకాంత్కు గొంతు, కార్తీక్కు ఛాతి, మిరావలికి వీపు భాగంలో గాయాలయ్యాయి. మిరావలికి 50 కుట్లు పడ్డాయి. ఈ మేరకు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.