సూర్యాపేట : నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ పంచాయతీ రాజ్ డీఈగా పనిచేస్తున్న పిండిగ కరుణసాగర్ నివాసలపై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి హైదరాబాద్లోని ఆయన నివాసంతో పాటు ఆయన స్వగ్రామం సూర్యాపేట పట్టణం కుడ కుడలోని ఇల్లు, బంధువుల ఇండ్లపై ఏక కాలంలో సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల ఉన్నాయనే సమాచారంతోనే ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం.