న్యూఢిల్లీ : దేశంలో ఒకే రోజు నమోదైన 3,82,315 కరోనా కేసుల్లో 71శాతం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పది రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. మంతిత్వశాఖ గణాంకాల ప్రకారం దేశంలో.. కేసులు మొత్తం 2,06,65,148కు చేరాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, హర్యానా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్లోనే కొత్త కొవిడ్ కేసుల్లో 70.91శాతం నమోదయ్యాయని మంత్రిత్వశాఖ తెలిపింది. మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్తో సహా 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వీక్లీ పాజిటివిటీ రేటు జాతీయ సగటు 21.46శాతం కంటే ఎక్కువగా ఉందని తెలిపింది.
గుజరాత్, అసోం, ఉత్తరప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్, తమిళనాడు, బిహార్తో సహా 17 రాష్ట్రాలు, యూటీల్లో వీక్లీ పాజిటివిటీ రేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని పేర్కొంది. మహారాష్ట్రలో రోజువారీ అత్యధికంగా 51,880 కేసులు నమోదయ్యాయి. తర్వాత కర్ణాటకలో 44,631, కేరళలో 37,190 ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు 34,87,229కు చేరాయి. మొత్తం కేసుల్లో 16.87శాతం ఉంది. 24 గంటల వ్యవధిలో 40,096 యాక్టివ్ కేసులు పెరిగాయి. క్రియాశీల కేసుల్లో 12 రాష్ట్రాల్లో 81.25శాతం ఉన్నాయి.
జాతీయ మరణాల రేటు పడిపోతోందని, ప్రస్తుతం 1.09శాతంగా ఉందని మంత్రిత్వశాఖ తెలిపింది. ఒకే రోజులు మహమ్మారి బారినపడి 3,780 మరణించాడు. కొత్త మరణాల్లో పది రాష్ట్రాల్లోనే 74.97 శాతం ఉన్నాయి. మహారాష్ట్రలో గరిష్ఠంగా 891 మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్లో 351 ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 1,69,51,731కు పెరిగాయి. 24 గంటల్లో 3,38,439 మంది కోలుకున్నారు. రికవరీలో పది రాష్ట్రాల్లోనే 73.4శాతం ఉందని మంత్రిత్వశాఖ తెలిపింది.