ప్రధాన రహదారిలో మితిమీరుతున్న మందుబాబుల ఆగడాలు
భయాందోళనలో స్థానికులు
పోలీసుల చొరవతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వేడుకోలు
హన్మకొండ చౌరస్తా, ఏప్రిల్ 16: సీసీ కెమెరా లు వచ్చాక నేరాలు అదుపులోకి వచ్చాయి. ఎవరైనా నేరాలు చేయడానికి జంకుతున్నారు. కానీ నగరంలోని పెద్దమ్మగడ్డలో సీసీ కెమెరాలు కానరావడంలేదు. ఇప్పటివరకు నేషనల్ హైవే 202 ప్రధాన రహదారిలో సీసీ కెమెరాలు లేకపోవడం విశేషం. ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని, నేరాల అదుపునకు వీటిని ఏర్పా టు చేసుకోవాలని పోలీసులు చెబుతున్నా ఎవరూ ముందుకు రావడంలేదని కాలనీ వాసులు వాపోతున్నారు. నిత్యం జనసంచారం ఉండే ప్రధాన రహదారుల్లో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమా దం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దమ్మగడ్డ రోడ్డులో బార్అండ్రెస్టారెంట్లు ఉండడం, రాత్రి అయితే చాలు ఆ రోడ్డులో మందుబాబుల గొడవలు జరుగుతున్నాని పేర్కొంటున్నారు. గతంలో ఇక్కడ దొంగతనాలు, హత్యలు జరిగిన సంఘటనలూ లేకపోలేదు. ఇటీవల అర్ధరాత్రి అటువైపు వెళ్తున్న ఓ వైద్యవిద్యార్థిపై దాడి జరిగిన ఘటన సైతం ఉంది. అయినప్పటికీ నిఘానేత్రాలు ఏర్పాటు చేయలేదని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు ఆకతాయిలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారే ఆరోపణలు ఉన్నా యి. ఇప్పటికైనా పోలీసుల చొరవతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాల నియంత్రణకు సహకరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి
IPL 2021: పంజాబ్కు షాక్.. ఫస్ట్ ఓవర్లోనే వికెట్
బెంగాల్ పోరు : ఏడు దాటితే ర్యాలీలు, బహిరంగ సభలకు బ్రేక్!