కోల్కతా : పశ్చిమ బెంగాల్ లో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాత్రి ఏడు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం వరకూ ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలను ఈసీ నిషేధించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొంది. ఇక ప్రచార సమయం ముగింపును రాత్రి పది గంటల నుంచి ఏడు గంటలకు కుదించింది.
పోలింగ్ కు ముందు 48 గంటలుగా ఉన్న సైలెన్స్ పీరియడ్ ను 72 గంటలకు పెంచుతున్నట్టు ఈసీ పేర్కొంది. ఇది మిగిలిన దశల పోలింగ్ తేదీలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో బెంగాల్ లో 6769 తాజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో మహమ్మారి బారినపడి 22 మంది మరణించారు.